వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం, నాగార్జునసాగర్లో ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. అక్టోబరు 31 వరకు 47 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరగా, తెలంగాణ 50 శాతం వాటా డిమాండ్ చేసింది.
ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు తమ వాదనలకు కట్టుబడటంతో నిర్ణయం వాయిదా పడింది. నీటి లభ్యత, అవసరాలు, కేటాయింపులపై సెప్టెంబరు 4న మళ్లీ సమావేశమై చర్చించనున్నారు.
Comments
Loading comments...

