వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ప్రతాపవాడకు చెందిన గోస్కుల అనిత (38) క్యాన్సర్తో మృతి చెందారు.
కొడుకులు లేకపోవడంతో తండ్రి సంపత్కు తోడుగా నిలిచిన పెద్ద కుమార్తె, తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. పాడెను మోసి, కడసారి వీడ్కోలు పలుకుతూ అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన కుమార్తెను చూసి గ్రామంలోని స్థానికులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Loading comments...

