వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టు నీరు విడుదల చేయడంతో జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో వరి నాట్లు ఊపందుకున్నాయి. వర్షాభావ పరిస్థితులలో సాగునీరు లేకపోవడంతో రైతులు వరికి దూరంగా ఉన్నారు.
పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువులు, బావులలో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో వాటి పరిధిలో మొదట రైతులు వరి నాట్లు వేశారు. తాజాగా ప్రాజెక్ట్ నీరు విడుదలై కెనాల్ ద్వారా వస్తుడడంతో రైతులు వరి నాట్లను ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

