వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామంలో శుక్రవారం పెన్షన్ దరఖాస్తుల విచారణ నిర్వహించారు. ఎంపీడీవో భరత్ కుమార్ దరఖాస్తులను పరిశీలించి, అర్హతకు సంబంధించిన వివరాలను తనిఖీ చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి సతీష్, కారోబార్ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

