వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల అర్బన్ మండలంలోని ధరూర్ క్యాంపు కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ డి. చంద్రకళ తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత కేజీబీవీలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హతలు, ఎంపిక విధానం వివరాలకు కేజీబీవీ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

