వార్తలకు తిరిగి వెళ్లండి

అలనాటి ప్రముఖ గాయని జమునారాణి బెంగళూరులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శుక్రవారం కల్లహళ్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
చిన్న వయసులోనే సంగీత ప్రయాణం ప్రారంభించిన ఆమె వేలాది పాటలు ఆలపించారు. ఆమె గాన సేవలను స్మరించుకుంటూ సినీ, సంగీత రంగ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
Comments
Loading comments...
