Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

Follow Udayam Digital on Google
Anjaiah kindoddy Jul 28, 2026 12:18 PM వికారాబాద్తెలంగాణ
జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ - Udayam Digital
మాజీ కేంద్ర మంత్రి, ప్రజానాయకుడు స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని స్పూర్తి స్థల్ వద్ద నివాళుల కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Comments

G
Loading comments...