Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Jul 29, 2026 6:31 PM శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుఆంధ్రప్రదేశ్
అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌ - Udayam Digital
మోటార్‌సైకిళ్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరిని బిట్రగుంట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 లక్షల విలువైన 19 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కావలి గ్రామీణ సీఐ శివశంకర్‌ తెలిపారు. విచారణలో ఏపీ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలిందన్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...