వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో మెదక్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాలతో శుక్రవారం బాంబ్, డాగ్ స్క్వాడ్లతో బస్టాండ్, రైల్వేస్టేషన్, థియేటర్లు, కలెక్టరేట్, కోర్టు ప్రాంగణాల్లో తనిఖీలు చేశారు.
రద్దీ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

