వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేసియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న విహార నౌక ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఈ ఘటనలో 129 మంది గల్లంతుకాగా, ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరో 108 మందిని రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు.
సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

