వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 25న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు - 2026 పోటీలు నిర్వహించనున్నట్లు సెట్విజ్ CEO అప్పలనాయుడు గురువారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ 15 నుంచి 29 ఏళ్ల యువతీ యువకులు ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. జానపద నృత్యం, గీతాలు, వీధి నాటకం, కవిత్వ రచన, పెయింటింగ్ పోటీలు ఉంటాయని, పాల్గొనేవారు ఆధార్, వయస్సు, ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

