వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ చరిత్రకారుడు సుమిత్ సర్కార్ కన్నుమూశారు. ఢిల్లీలోని తన నివాసంలో వయోభారంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 ఏళ్లు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేసిన సుమిత్ సర్కార్ జాతీయవాదం, స్వాతంత్య్ర ఉద్యమం, బ్రిటిష్ పాలనపై విస్తృతంగా రచనలు చేశారు. ‘ది స్వదేశీ మూవ్మెంట్ ఇన్ బెంగాల్’ తదితర పుస్తకాలు రచించారు.
Comments
Loading comments...

