వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,74,711 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం ఉదయం 6 గంటలకు జలాశయం నీటిమట్టం 846.10 అడుగులకు చేరగా, నీటి నిల్వ 72.1974 టీఎంసీలుగా నమోదైంది. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...
