వార్తలకు తిరిగి వెళ్లండి

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న రంజిత్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 350 గ్రాముల 71 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
దుండిగల్ తండా-2లో తనిఖీలు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బిహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి స్థానిక కార్మికులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
