వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లులోని ఒక నర్సింగ్ హోమ్లో బాలింతకు మగబిడ్డ పుడితే, వైద్యులు ఆడబిడ్డ అని తప్పుడు సమాచారం ఇచ్చారు. నెల రోజుల పాటు శిశువును తల్లిదండ్రులకు చూపించకుండా, అనారోగ్యం పేరుతో తరలించారు. చివరికి కర్నూలు ఆస్పత్రిలో పరీక్షల సమయంలో అసలు విషయం బయటపడింది.
మగబిడ్డను ఆడబిడ్డగా మార్చి, నెల రోజుల పాటు దాచిపెట్టడంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్వాకానికి నిరసనగా ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Comments
Loading comments...

