వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 46.7 అడుగులకు చేరుకోగా, 10.83 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద నీరు తగ్గడంతో పలు రహదారుల్లో రాకపోకలు పునరుద్ధరించగా, పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు.
Comments
Loading comments...
