Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాధునికి 51 నైవేద్యాల సమర్పణ

Follow Udayam on Google
p.g.murthy Sep 19, 2026 4:48 PM మంచిర్యాలGeneral
గణనాధునికి 51 నైవేద్యాల సమర్పణ - Udayam
దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి 51 నైవేద్యాలతో మహిళలు, భక్తులు పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా దండేపల్లిలోని తాసిల్దార్ కార్యాలయం రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శుక్రవారం మధ్యాహ్నం మహిళలు, భక్తులు 51 నైవేద్యాలను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. మండలంలోని పలు గ్రామాలలో కూడా వినాయక మండపాల వద్ద కుంకుమ పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...