వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజంపేటలో గాలి పోచమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
మహిళలు, యువత బోనాలతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

