వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి పొలం వద్ద గడ్డి కోయడానికి వెళ్లిన జమాయమ్మ(50) పిడుగుపాటుకు గురయ్యారు. వెంటనే ఆమెను కల్లూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

