వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. వ్యూహాత్మక ఎల్పీజీ నిల్వలను పెంచే ప్రణాళికలో భాగంగా కిలోకు రూ.1.29 అదనపు రుసుము విధించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రతిపాదన అమలైతే 14.2 కిలోల గృహ సిలిండర్ ధర సుమారు రూ.18 పెరగొచ్చు. సీఎన్జీపై కూడా అదనపు రుసుము విధించే అంశం పరిశీలనలో ఉంది. అయితే దీనికి ఇంకా కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించలేదు.
Comments
Loading comments...

