వార్తలకు తిరిగి వెళ్లండి

చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న యూపీకి చెందిన పింటు (33) ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడు ఐస్క్రీం బండి నడుపుతూ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు మరియు 10 రోజుల కిందట గంజాయి తెప్పించాడు.
ఎవరికీ అనుమానం రాకుండా చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్న పింటు RTPP క్రాస్ వద్ద మంగళవారం చిక్కాడు. మరో వ్యక్తి పరారయ్యాడు. 1,280 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ASP విభూకృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

