Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాకప్‌డెత్‌పై సీబీఐ విచారణ కోరిన తల్లి

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:14 AM అమరావతిGeneral
లాకప్‌డెత్‌పై సీబీఐ విచారణ కోరిన తల్లి - Udayam
కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన తల్లి విజయలక్ష్మి హైకోర్టులో రిప్లై పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌ విచారణతో న్యాయం జరగదని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తే శరణ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు అన్ని వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...