Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 14, 2026 2:56 PM నారాయణపేటతెలంగాణ
కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం - Udayam
కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని కమీషన్ల కోసమే చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. 90 కిలోమీటర్ల మేర పైపుల ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టు ఇదేనని అన్నారు. ఒక్క టీఎంసీ సామర్థ్యమున్న రిజర్వాయర్‌ నుంచి ఏడు టీఎంసీల నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, పర్యావరణ అనుమతులు లేవని, నిర్మాణ వ్యవహారం గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...