Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాగులో కొట్టుకుపోయిన వ్యాన్‌.. 9 మంది మృతి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 10, 2026 7:18 PM ఆల్ ఇండియా జాతీయ
వాగులో కొట్టుకుపోయిన వ్యాన్‌.. 9 మంది మృతి - Udayam
మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా వ్యాన్‌ కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ బాలిక ఉంది. వ్యాన్‌లో 11 మంది ఉండగా ఇద్దరు ఈదుకుంటూ బయటపడ్డారు. సారంగ్‌పూర్‌ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ముందుకు వెళ్లొద్దని స్థానికులు, అధికారులు హెచ్చరించినా డ్రైవర్‌ వాగులోకి వెళ్లడంతో వ్యాన్‌ కొట్టుకుపోయిందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...