వార్తలకు తిరిగి వెళ్లండి

మూడుమాసాల రేషన్ బియ్యం పంపిణీ గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఆగస్టు 31తో ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 5 వరకు పెంచింది. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీతో పలు దుకాణాల్లో నిల్వలు నిండిపోవడంతో కొందరు లబ్ధిదారులు వెనుదిరిగారు.
తాజాగా దుకాణాలకు బియ్యం నిల్వలు చేరడంతో గడువు పొడిగించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బియ్యం తీసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

