Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్లకు సమాన వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:19 PM నల్గొండGeneral
డ్రైవర్లకు సమాన వేతనం ఇవ్వాలి: సీఐటీయూ - Udayam
నల్గొండ కార్పొరేషన్‌లో ట్రాక్టర్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీలో కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలని కోరారు. నల్గొండలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, 115 మంది డ్రైవర్లలో 48 మందికి రూ.20,500, మిగిలిన 67 మందికి రూ.16,500 ఇవ్వడం అన్యాయమన్నారు. అందరినీ సెమీ స్కిల్డ్‌గా గుర్తించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...