వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులోని మొబైల్, సెల్ఫోన్ దుకాణాల్లో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వాసు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనలపై ఏడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
మొత్తం 12 దుకాణాలను తనిఖీ చేయగా.. ఉత్పత్తులపై ఎంఆర్పీ వివరాలు ప్రకటించకపోవడం, ప్రకటించిన ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం వంటి ఉల్లంఘనలు గుర్తించారు. నిబంధనల మేరకు విక్రయించాలని హెచ్చరించారు.
Comments
Loading comments...

