వార్తలకు తిరిగి వెళ్లండి
ఏకాదశి రథోత్సవంతో విఠోబా ఆలయం వద్ద భక్తుల రద్దీ.. ట్రాఫిక్ మందగింపు.

HYD: ఏకాదశి పూజలు, రథోత్సవం సందర్భంగా ఎస్జే బ్రిడ్జి సమీపంలోని విఠోబా ఆలయానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. దీంతో సెంట్రల్ లైబ్రరీ-ఎస్జే బ్రిడ్జి-గౌలిగూడ-రంగ్ మహల్ మార్గంలో వాహనాల రాకపోకలు మందగించాయి. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు, వాహనదారులు సహనం పాటిస్తూ ట్రాఫిక్ పోలీసుల సూచనలు అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...