వార్తలకు తిరిగి వెళ్లండి

ఎటపాక మండలం నెల్లిపాక గ్రామపంచాయతీకి మంజూరైన ఈ-ఆటోను ఎంపీడీవో ఎల్. విజయదత్ మంగళవారం ప్రారంభించారు. ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి వర్మీ కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రజలు చెత్తను తడి, పొడిగా వేర్వేరుగా అందించాలని కోరారు అని ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యప్రసాద్, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

