వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురం అశోక్నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు దక్షిణామూర్తి గణపతి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Loading comments...

