వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండల కేంద్రంలోని శ్రీ విశ్వబ్రాహ్మణ మందిరం వద్ద విశ్వబ్రాహ్మణ జయంతి వేడుకలను గురువారం విశ్వబ్రహ్మ కుల సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
. కుల సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

