Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఈడీ పరీక్షలకు 80% ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 01, 2026 3:29 PM వరంగల్తెలంగాణ
డీఈడీ పరీక్షలకు 80% ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి - Udayam Digital
డీఈడీ రెండేళ్ల కోర్సు విద్యార్థులు ఈ ఏడాది నుంచి వార్షిక పరీక్షలు రాయాలంటే 80 శాతం ముఖ గుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్‌) తప్పనిసరి కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలు అమలు చేయనుంది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది రోజూ ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదు చేయాలి. కళాశాలల్లో హాజరు పర్యవేక్షణ పక్కాగా చేపట్టి, నిబంధనలు పూర్తి చేసిన వారినే పరీక్షలకు అనుమతించనున్నారు.

Comments

G
Loading comments...