వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవ నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులతో సీఐ షేక్ ఖాజావలి శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు.
మండపాలు, ఉత్సవాల్లో విధిగా క్రమశిక్షణ పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

