వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ–2025 అక్రమాలపై మాట్లాడితే చర్యలంటూ ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను ఆధారాలుగా సమర్పించాలని హైకోర్టు పిటిషనర్ను ఆదేశించింది. బాధిత అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చే అంశంపైనా స్పష్టత ఇవ్వాలని సూచించింది.
సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మెరిట్ జాబితా విడుదల కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
Comments
Loading comments...
