Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతా శిశు మరణాలు బాధాకరం: డీఎంహెచ్‌వో

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 14, 2026 3:25 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
మాతా శిశు మరణాలు బాధాకరం: డీఎంహెచ్‌వో - Udayam
మాతా శిశు మరణాల నివారణకు వైద్య, ఆరోగ్య, అంగన్వాడీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని DMHO ఫిరోజ్ బేగం సూచించారు. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు గృహ సందర్శనలు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత అరగంటలోపు శిశువుకు తల్లిపాలు పట్టించాలని తెలిపారు. జూలైలో ఒక మాతా, మూడు శిశు మరణాలు సంభవించడం బాధాకరమని పేర్కొన్నారు. నివారించగల మరణాలను అరికట్టేందుకు బాధ్యతగా పనిచేయాలన్నారు.

Comments

G
Loading comments...