Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 11, 2026 5:03 PM అన్నమయ్యఆంధ్రప్రదేశ్
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి - Udayam
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి పోలీసులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి 62 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో 28 భూ వివాదాలు, 10 ఆర్థిక, 10 కుటుంబ, 3 అశాంతి, 2 మోసం, 9 ఇతర ఫిర్యాదులు ఉన్నాయి. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...