Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరెళ్ల బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి: కవిత

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 28, 2026 6:07 PM హైదరాబాద్తెలంగాణ
నేరెళ్ల బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి: కవిత - Udayam Digital
నేరెళ్ల ఘటనపై టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత స్పందించారు. గతంలో పాలించిన కుటుంబంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని, బాధితులకు క్షమాపణలు కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. కొందరి ధనదాహంతో నేరెళ్లలో ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం అందలేదని, వారికి రూ.కోటి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన బాధితుడి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.

Comments

G
Loading comments...