వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు సీఎం విజయ్ తన జన్మదినం సందర్భంగా జూన్ 22న రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో 46 వేల కార్డులను సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది.
సీఎంగా బాధ్యతలు చేపట్టాక విజయ్ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడంతో, టీవీకే పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దరఖాస్తు చేసుకున్న మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే కార్డులు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

