వార్తలకు తిరిగి వెళ్లండి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పులలో 24 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు చెన్నూరు సబ్స్టేషన్ను ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

