వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్లో చండీపుర వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది పిల్లలు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో ఏడుగురు పిల్లలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో నమోదైన 184 అనుమానిత కేసుల్లో 35 మందికి వైరస్ నిర్ధారణ అయిందని మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. వైరస్ నియంత్రణకు ఆరోగ్య శాఖ నిఘా పెంచి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
