వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో నీరు, శిథిలాలు చేరిన ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. సహాయక చర్యలను సీఎం పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం పరిశీలించారు.
టన్నెల్లో చిక్కుకున్న మరో ముగ్గురి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

