Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Aug 08, 2026 10:30 AM హైదరాబాద్తెలంగాణ
గచ్చిబౌలిలో కారు ప్రమాదం.. ఇద్దరు మృతి - Udayam Digital
గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు టైల్స్‌ కార్మికులు మృతి చెందారు. నియోపోలీస్‌ బ్రిడ్జి పిల్లర్‌ను టవేరా కారు ఢీకొనడంతో రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్‌(25), దేరామ్‌(24) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇంద్రారెడ్డినగర్‌ నుంచి నానక్‌రామ్‌గూడ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి పిల్లర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...