వార్తలకు తిరిగి వెళ్లండి

చనుగొండ్ల గ్రామంలోని శివాలయం ఎదుట శిథిలావస్థకు చేరిన పాత బావిని డోన్ సీఐ రాకేష్ ప్రత్యేక చొరవతో పూడిక తీయించారు. చాలా రోజులుగా పూడిక, మట్టి, చెత్తాచెదారంతో నిండిపోయి నిరుపయోగంగా ఉన్న బావిని పూర్తిగా శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై మమత, పోలీసు సిబ్బంది, రవి, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. సీఐ రాకేష్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

