వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా పుట్లగట్లగూడెం గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

