వార్తలకు తిరిగి వెళ్లండి

పానగల్ మండలం చింతకుంటలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు నిరసనలు మూడో రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు రైతులతో కలిసి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు.
యూరియా కొరత, బుకింగ్ యాప్ సమస్యలపై యూరియా బస్తాకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సాగునీరు, రైతు భరోసా, రైతు బీమా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

