Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల ఊరేగింపులో ఘర్షణ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 14, 2026 10:43 AM సూర్యాపేటతెలంగాణ
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్ యువజన కార్యకర్తపై కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేశారని సమాచారం. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...