Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బకాయిలు చెల్లించినా.. మాల్యాపై కేసులు కొనసాగుతాయ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:11 AM జాతీయంవాణిజ్యం
బకాయిలు చెల్లించినా.. మాల్యాపై కేసులు కొనసాగుతాయ్‌ - Udayam
విజయ్‌ మాల్యా బకాయిలు చెల్లించినా ఆయనపై మనీలాండరింగ్‌ కేసులు కొనసాగుతాయని ఈడీ బాంబే హైకోర్టుకు తెలిపింది. బ్యాంకులు రుణాలు రాబట్టినంత మాత్రాన క్రిమినల్‌ ఆరోపణలు రద్దు కావని స్పష్టం చేసింది. రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు అప్పగించినా కేసులు నిలిచిపోవని ఈడీ పేర్కొంది. భారత్‌కు తిరిగి వచ్చి దర్యాప్తును ఎదుర్కోవాలని మాల్యాను కోరినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...