వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్(జి) మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు తోడిశెట్టి సుదన్ శనివారం మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు.
ఈ సందర్భంగా పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కేటీఆర్ సూచించినట్లు సుదన్ తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కేటీఆర్ పేర్కొన్నట్లు చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

