వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలు మండలంలోని ప్రైవేట్ వసతి గృహంలో బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థి శేషు(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపట్ల జిల్లా కర్లపాలెంకు చెందిన శేషు శుక్రవారం గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు.
తరగతి గదిలో అధ్యాపకురాలు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

