Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి: రసమయి

Follow Udayam on Google
sudheer Aug 08, 2026 6:56 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన రాజేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను శనివారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన రాజేందర్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, లేకపోతే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని రసమయి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...